తిరుపతి లోని శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయంలో ఘనంగా రథ సప్తమి నిర్వహించారు. సూర్య ప్రభ వాహనంపై స్వామి వారు భక్తులను కటాక్షించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి వారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేసింది.