ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పై క్రమశిక్షణ చర్యలకు టీపీసీసీ రంగం సిద్ధం చేస్తోంది. పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం పై కొంతమంది పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేశారు. వరంగల్ బీసీ యుద్ధభేరిలో ఒక కులాన్ని కించ పరచడం, అనుచిత వ్యాఖ్యలు చేయడంపై డీజీపీ, టీపీసీసీ చీఫ్ ముకేష్ కుమార్ గౌడ్ లకు ఫిర్యాదు చేశారు. తనకు షోకాజ్ నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం.