కామారెడ్డి: పట్టణానికి చెందిన విపుల్ జైన్ బీజేపీ స్టేట్ కౌన్సిల్ సభ్యుడిగా నియమితులయ్యారు. జిల్లా కేంద్రానికి చెందిన విపుల్ జైన్ గతంలో బీజేపీ కామారెడ్డి పట్టణ ప్రధాన కార్యదర్శిగా, పట్టణ అధ్యక్షుడిగా, జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. తనపై నమ్మకంతో స్టేట్ కౌన్సిల్ సభ్యుడిగా నియామకానికి సహకరించిన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి విపుల్ జైన్ ధన్యవాదాలు తెలిపారు.