బెల్లంపల్లి పట్టణంలోని 26వ వార్డు అశోక్ నగర్ లో గత కొన్నేళ్లుగా రైల్వే కాంపౌండ్ లేక పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ దృష్టికి తీసుకు వెళ్లారు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చిప్ప మనోహర్. దీనిపై తాను ఇప్పటికే రైల్వే జీఎంతో మాట్లాడానని, సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని ఈ సందర్బంగా తెలిపారు. మున్సిపల్ కమిషనర్ , టీపీఓ సమక్షంలో వార్డును సందర్శించారు ఎమ్మెల్యే. చిప్ప మనోహర్ తో పాటు పార్టీ నేతలు కుంబాల రాజేష్, సలీం ఉన్నారు.