బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షునిగా తనను 2వసారి నియమించినందుకు నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురిని కలిసి జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి ధన్యవాదాలు తెలిపారు. అలాగే బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, రాజ్యసభ సభ్యులు డా.కే లక్ష్మణ్ ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో ఎంపీ అర్వింద్ సహాయ సహాకారంతో బీజేపీ పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి తెలిపారు.