తెలంగాణలో కుటుంబ సర్వేలో 21 లక్షల మంది మిస్సింగ్ కావడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ చీఫ్ స్వామి ముద్దం. మిస్సింగ్ అయిన వారిలో అంతా బీసీలకు చెందిన వారే ఉన్నారని, వారంతా ఏమై పోయారని ప్రశ్నించారు. ఇంత మిస్సింగ్ వెనుక ఎవరి ప్రమేయం ఉందో తేలాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు.