మున్సిపాల్టీలకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని అన్నారు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. ఆలస్యం చేయకుండా స్థానిక ఎన్నికలు వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. తక్షణమే నోటిఫికేషన్ జారీ చేయాలన్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ముస్లింల్లో వెనుకబాటుతనం చాలా ఉందని, ఏ కులమైనా మనందరం భారతీయులమన్నారు.