ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల ఎన్డీఏ పట్టభద్రుల పోస్టర్ ఆవిష్కరణ
NEWS Feb 04,2025 11:21 am
ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల ఎన్డీఏ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు రాష్ట్ర కాపునాడు మద్దతు తెలిపారు. ఈసందర్భంగా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం స్థానిక చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ చిలకలూరిపేట స్థానిక ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు జనసేన సమన్వయకర్త తోట రాజా రమేష్, బీజేపీ చిలకలూరిపేట కన్వీనర్ తాడిపర్తి జయరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.