మల్లాపూర్ ప్రెస్ క్లబ్ లో టీయూడబ్ల్యూజేహెచ్ 143 మహాసభ పోస్టర్ను రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగుల రాంగోపాల్ ఈరోజు ఆవిష్కరించారు. జర్నలిస్టుల హక్కుల కోసం ఈనెల 9న వేములవాడలో జరిగే మహాసభకు అత్యధికంగా జర్నలిస్టులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శికారి రామకృష్ణ, ఎలాక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు దొమ్మాటి అంజుగౌడ్, మల్లాపూర్ అధ్యక్షుడు ముత్యాల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.