కోరుట్ల పట్టణంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ డే ర్యాలీని నిర్వహించారు. కోరుట్ల పట్టణంలోని వైద్యులు, వైద్య సిబ్బంది కలిసి పాత బస్టాండ్ నుంచి కొత్త బస్టాండ్ వరకు ర్యాలీగా వెళ్లారు. ప్రజలు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అనంతరం బస్టాండ్ వద్ద మానవహారంగా ఏర్పడి క్యాన్సర్ భూతాన్ని తరిమి కొడదామని నినదించారు.