కాంగ్రెస్ హయాంలోనే రైతు ఆత్మహత్యలు
NEWS Feb 04,2025 10:15 am
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయని వ్యవసాయశాఖ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నంలో గతనెల 20న ఆత్మహత్య చేసుకున్న యువరైతు పిట్లలింగన్న కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీ రైతు కమిటీ సభ్యులతో కలిసి పరామర్శించారు. జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, మాజీ మంత్రులు పువ్వాడ అజయ్, కొప్పుల ఈశ్వర్, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, తదితరులు ఉన్నారు.