మెట్పల్లి పాత బస్టాండ్ లో బీజేపీ పట్టణశాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను స్వాగతిస్తూ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చేలా బడ్జెట్ ఉందని పట్టణ బీజేపీ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బొడ్ల రమేష్, నరేందర్ రెడ్డి, సుఖేందర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.