ప్రతి ఇంటికి త్రాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మెట్పల్లి పట్టణ శివారులో మిషన్ భగీరథ పైప్ లైన్ పనుల పురోగతిని ఆయన మంగళవారం పరిశీలించారు. పనులను వేగవంతంగా నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు. లీకేజీ సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. ఆయన వెంట అధికారులు ఉన్నారు.