రైతు కుటుంబానికి సింగిరెడ్డి భరోసా
NEWS Feb 04,2025 09:16 am
ఇబ్రహీంపట్నంలో గత నెల 14వ తేదీన అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్న రైతు పిట్ల లింగం కుటుంబాన్ని పరామర్శించారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1800 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని, సగటున రోజుకొక రైతు అప్పుల బాధ భరించలేక, ఋణమాఫీ కాలేక, రైతుబంధు రాలేక బలవన్మరణానికి పాల్పడుతున్నారని వాపోయారు. రైతులకు అండగా ఉంటామని, ప్రభుత్వ తీరును ఎండ గడతామని హెచ్చరించారు.