అనకాపల్లి జిల్లా అర్ల పంచాయతీ లోని నీలబంద గ్రామంలో 3 కుటుంబాలు, 26 మంది ఉంటున్నారు. డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారి కారణంగా ఈ గ్రామంలో స్వాతంత్రం వచ్చిన 77 ఏళ్ల తర్వాత విద్యుత్ సౌకర్యం రావడం, మొదటి లైట్ వెలగడంతో గ్రామ ప్రజలు ఆనందంతో, థింసా నృత్యం చేస్తూ హర్షం వ్యక్తం చేశారు.