నూకపల్లిలో వసంత పంచమి వేడుకలు
NEWS Feb 03,2025 06:05 pm
వసంత పంచమి వేడుకలను మల్యాల మండలం నూకపల్లి సరస్వతి ఆలయంలో కన్నులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారికి ఉదయం గణపతి పూజ, అభిషేకం, అర్చన, సరస్వతి హవనం, మంత్ర పుష్పం కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. చిన్నారులతో అక్షరాభ్యాసం, విజయ కంకణధారణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిర్వాహకులు అన్నదాన కార్యక్రమం చేపట్టారు.