మోదీ చిత్రపటానికి పాలాభిషేకం
NEWS Feb 03,2025 06:04 pm
కేంద్ర ప్రభుత్వం 2025 బడ్జెట్ పేద ప్రజలకు ఉపయోగపడేలా వుందని, వికసిత్ భారత్ లో భాగంగా దేశ వృద్ధిరేటు పెరిగేలా ఈ బడ్జెట్ తయారు చేశారని మల్యాల కేంద్రంలోని అంగడి బజార్లో ప్రధాని మోదీ చిత్రపటానికి మండల బీజేపీ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షుడు గాజుల మల్లేశం, జిల్లా ఉపాధ్యక్షుడు బింగి వేణు, రవి, వెంకటస్వామి, ప్రసాద్, రాములు, రాజ్ కుమార్, శ్రీకాంత్, చక్రం గౌడ్, మండల బీజేపీ నాయకులు పాల్గొన్నారు.