వసంత పంచమి సందర్భంగా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో పలు దేవాలయాలను సందర్శించి రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీర్కూర్ మండల కేంద్రంలోని శ్రీ కోదండ రామాలయానికి వెళ్లి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీర్కూరు మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల ఆలయంలో నిర్వహించిన వసంత పంచమి వేడుకల్లో పోచారం పూజలు నిర్వహించారు.