మిషన్ భగీరథ (ఆర్డబ్ల్యూఎస్) ఏఈఈ కే సాయిచరణ్ ఆత్మహత్య ఘటనపై విచారణ చేపట్టి కారణాలను తేల్చాలని తోటి ఉద్యోగులు కోరారు. జస్టిస్ ఫర్ సాయిచరణ్ అంటూ ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మిషన్భగీరథ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. మిషన్ భగీరథలో 2024 నవంబర్లో ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన సాయిచరణ్ మధ్యాహ్నం ఆత్మహత్యకు పాల్పడ్డాడని అన్నారు. సెక్రెటరీ ద్వారా డబ్బుల చెల్లింపులో ఇబ్బందులు ఎదురవడంతో ఒత్తిడికి గురైన సాయిచరణ్ ఆత్మహత్య చేసుకున్నాడన్నారు.