అల్బెండజోల్ మాత్రలు పంపిణీకి చర్యలు
NEWS Feb 04,2025 03:03 am
జాతీయ నులి పురుగుల నిర్మూలన దినం సందర్భంగా ఈనెల 10వ తేదీన 1 నుంచి 19 సంవత్సరాల పిల్లలందరికీ అల్బెండజో ల్ మాత్రలు అందించాలని నిజామాబాద్ డీఎంహెచ్వో రాజశ్రీ సూచించారు. అంగన్వాడీ కేంద్రాలతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో విద్యార్థులకు మాత్రలు అందించాలన్నారు. అల్బెండజోల్ మాత్రలతో నులి పురుగులను, రక్తహీనతను నిర్మూలించవచ్చని, పోషకాహా ర లోపాన్ని అరికట్టవచ్చన్నారు. అనారోగ్యం, ఇతర కారణాలతో 10వ తేదీన మాత్రలు వేసుకోని పిల్ల లు 17వ తేదీన తప్పనిసరిగా వేసుకోవాలన్నారు.