కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయిస్తూ బడ్జెట్ ని సవరించి, పున పరిశీలన చేసి ప్రకటన చేయాలని సీపీఐ(ఎం) పార్టీ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ దిష్టిబొమ్మను నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో దగ్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నదని, అందులో తెలంగాణ మీద మరింత కపట ప్రేమ చూపిస్తున్నదని విమర్శించారు.