తమిళనాడులో జరిగిన 2nd UGKFI నేషనల్ కరాటే డు ఛాంపియన్షిప్ కాంపిటీషన్లో తెలంగాణ స్టేట్ నుండి కామారెడ్డి జిల్లా సంగమేశ్వరు గ్రామానికి చెందిన వడ్ల భాను హర్ష అండర్ 14బాయ్స్ విభాగంలో సత్తా చాటారు.38 KGS ఈవెంట్లో బంగారు పతకం సాధించి శ్రీలంకలో జరగబోయే ఇంటర్నేషనల్ లెవెల్ కి సెలెక్ట్ అయ్యారు. విద్యార్థి భాను హర్ష ని మాస్టర్ కొండ లక్ష్మినర్సు, గ్రాండ్ మాస్టర్ కామిండ్ల రాజయ్య అభినందించారు. వడ్ల ఆనందం నాగరాణి గార్లకు ఇద్దరు కుమారులు మొదటివాడు భానుహర్ష. గ్రామస్తులు అభినందనల తెలిపారు.