లింగంపేట మండలం రాంపల్లి తండాలో శ్రీ జగదాంబ సేవలాల్ మహారాజ్ ఆలయ ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. సేవాలాల్ మహారాజ్
ఉత్సవాల్లో ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. గిరిజన ఆరాధ్య దైవం సేవాలాల్ జయంతి వేడుకలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు .