ఆరోగ్యం, సామాజిక సంక్షేమం విషయంలో సేవలు అందించే ‘సూద్ చారిటీ ఫౌండేషన్’ ప్రజారోగ్య సంరక్షణ కోసం నాలుగు అంబులెన్స్లను రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. ఫౌండేషన్ ఫౌండర్ సోనూ సూద్ సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిశారు. అంబులెన్స్ ల తాళాలను అందజేశారు. నటుడిని అభినందించారు. నటీ నటులు, ప్రముఖులు సామాజిక సేవలకు చేయూత ఇవ్వాలని కోరారు.