ఢిల్లీ రాష్ట్ర అభివృద్ది బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు సీఎం చంద్రబాబు. ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. చెత్తా చెదారానికి దేశ రాజధాని కేరాఫ్ గా మారిందంటూ మండిపడ్డారు. మనందరి ఆత్మ గౌరవం ఈ ప్రాంతం. దీనిని పరిశుభ్రంగా ఉంచడంలో ఆప్ సర్కార్ విఫలమైందని ఆరోపించారు. గత పదేళ్లుగా పాలనా వైఫల్యంతో ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి అవుతోందన్నారు. కేజ్రీవాల్ మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారంటూ ఆరోపించారు.