తిరుమల పుణ్య క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది. శ్రీవారిని, అలివేలు మంగమ్మను 75 వేల 706 మంది భక్తులు దర్శించుకున్నారు. 23 వేల 340 మంది తల నీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.34 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో శ్యామల రావు. స్వామి వారి దర్శనం కోసం ప్రస్తుతం 6 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, టోకెన్లు లేని భక్తులకు 3 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.