హన్మకొండలో జరిగిన బీసీ యుద్దభేరి రణ నినాదం చేసింది. రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం బీసీ సామాజిక వర్గాలు ఉన్నాయని తాజాగా నిర్వహించిన సర్వేలో తేలిందన్నారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. మా కోటా మాకు దక్కేంత దాకా పోరాటం ఆపబోమంటూ స్పష్టం చేశారు. అతి తక్కువ శాతం ఉన్న రెడ్లు అధికారాన్ని చెలాయిస్తున్నారని, వారి ఆటలు ఇక సాగవని హెచ్చరించారు. బీసీలను తక్కువ అంచనా వేయొద్దని, రెడ్లు, వెలమలు తెలంగాణకు చెందిన వారు కారంటూ ఆరోపించారు.