నేటి నుంచి 1 గ్రాడ్యుయేట్, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈనెల 10వ తేదీ వరకు నామినేషన్లు సమర్పించేందుకు గడువు విధించింది ఎన్నికల సంఘం. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనుంది. 11వ తేదీన నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణకు గడువు విధించింది. ప్రత్యేక అసెంబ్లీ సందర్భంగా నామినేషన్ దాఖలు చేయనున్నారు ప్రధాన పార్టీల అభ్యర్థులు.