కుల గణనపై ఇచ్చిన మాట ప్రకారం సర్వే నిర్వహించామన్నారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్. రాహుల్ గాంధీ మార్గనిర్దేశంలో సర్వే జరిగిందన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు న్యాయం జరగాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో ఈ స్థాయిలో సర్వే ఎక్కడా నిర్వహించ లేదన్నారు. 50 రోజుల్లోనే సర్వే పూర్తి చేశామని చెప్పారు. 4న జరిగే కేబినెట్ భేటీలో సర్వేను ప్రవేశ పెడతామని వెల్లడించారు.