ముంబైలో పర్యటిస్తున్న బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునక్ హల్ చల్ చేశారు. పార్సీ జింఖానా గ్రౌండ్ లో ఆయన క్రికెట్ ఆడారు. గల్లీ బాయ్స్ తో కలిసి ఎంజాయ్ చేశారు. వాంఖడే స్టేడియంలో భారత్ , ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన 5వ టి20 మ్యాచ్ ను వీక్షించారు. ఈ సందర్బంగా ఇరు జట్ల కెప్టెన్లు సూర్య కుమార్ యాదవ్, జోష్ బట్లర్ ను కలిశారు. అద్భుతంగా ఆడిన భారత క్రికెటర్ అభిషేక్ శర్మను ప్రత్యేకంగా అభినందించారు మాజీ ప్రధాని.