ఒత్తిడి నియంత్రణపై అవగాహన ఉండాలని రిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఓం ప్రకాశ్ అన్నారు. అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాలలో ప్రభు త్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న కెరీర్ కౌన్సెలింగ్ అండ్ గైడెన్స్ శిక్షణ ముగిసింది. రెండో రోజు శిక్షణలో భాగంగా స్ట్రెస్ మేనేజ్మెంట్పై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒత్తిడిని జయించినప్పుడే మానసిక ఆరో గ్యం సాధ్యమవుతుందన్నారు.