ఎమ్మెల్సీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
NEWS Feb 03,2025 04:11 am
జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఉమ్మ డి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలతో కూడిన పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని 18 మండలాల్లో 32 కేంద్రాలను ఏర్పా టు చేసినట్లు తెలిపారు. వీటి పరిధిలో ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి 16,417 మంది ఓ టర్లు ఉన్నారని పేర్కొన్నారు.