మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఈనెల 15 లోపు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి విధి విధానాలను రూపొందిస్తున్నామన్నారు. పార్టీకి చెందిన శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని, అన్ని స్థానాలను కైవసం చేసుకునేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇవ్వకూడదని, హస్తం హవా కొనసాగాలని కోరారు.