నందిపేట్ మండలంలోని వెల్మల్ చౌరస్తాలో పోలీసులు రెండున్నర కిలోల గంజాయిని పట్టుకున్నారు. వెల్మల్ చౌరస్తాలో వాహనాల తనిఖీ చేపట్టారు. నిజామాబాద్కు చెంది షేక్ అఫ్రోజ్, షేక్ మహబూబ్ స్కూటీపై వస్తుండగా అనుమానంతో వాహనాన్ని తనిఖీ చేసి గంజాయిని గుర్తించారు . యువకులు, విద్యార్థులకు గంజాయి సరఫరా చేస్తున్నట్లు ఒప్పుకున్నారు. అఫ్రోజ్ గతంలో గంజాయి కేసులో పట్టుబడినట్లు సీఐ తెలిపారు.