యాసంగి సీజన్ పెట్టుబడి సాయం సొమ్ము జమ చేయడంలో ఇంకా కొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రైతుల ఖాతాల్లో రైతు భరోసా సొమ్ము జమ కావాల్సి ఉంది. గణతంత్ర దినోత్సవం రోజున లాంఛనంగా నిజామాబాద్ జిల్లాలో ఎంపిక చేసిన 31 గ్రామాలలోని రైతులకే వంద శాతం రైతు భరోసా సొమ్మును జమ చేశారు. మిగిలిన గ్రామాల్లోని రైతులకు మాత్రం ఇంకా సొమ్ము జమ కాలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలుతో రైతు భరోసాకు బ్రేక్ పడుతుందని ఊహాగాలు వినిపిస్తున్నాయి.