గుర్తు తెలియని వాహనం ఢీకొని రోడ్డు పక్కన నిలుచున్న వ్యక్తి మృతి చెందిన ఘటన నాయుడుపేట పట్టణ పరిధిలోని మల్లాం కూడలి వద్ద ఆదివారం సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న నాయుడుపేట సీఐ బాబి ఘటనా స్థలి వెళ్లి దర్యాప్తు చేశారు. పోలీసుల వివరాలు మేరకు మృతుడు దొరవారిసత్రం మండలం నెల్లబల్లి గ్రామానికి చెందిన పున్నేపల్లి దశరధరామయ్యగా గుర్తించామని పోలీసులు తెలిపారు.