ఏఐసీసీ ఈగల్ టీమ్ సభ్యుడిగా వంశీ చందర్ రెడ్డి
NEWS Feb 02,2025 02:24 pm
ఏఐసీసీ కీలక ప్రకటన చేసింది. ఈగల్ టీమ్ (ఎంపవరడ్ యాక్షన్ గ్రూప్ ఆఫ్ లీడర్స్ అండ్ ఎక్స్ పర్ట్స్) సభ్యుడిగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన వంశీ చందర్ రెడ్డిని నియమించింది. ఆయనతో పాటు అజయ్ మాకేన్, దిగ్విజయ్ సింగ్, అభిషేక్ సింఘ్వీ, ప్రవీణ్ చక్రవర్తి, పవన్ ఖేరా, గురుదీప్ సింగ్ సప్పల్, నితిన్ రావత్లను ఎంపిక చేసిందని పార్టీ వెల్లడించింది.