తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) మెదక్ జిల్లా కార్యదర్శిగా రేగోడ్ మండల పరిధిలోని ఎంపీపీఎస్ వెంకటాపూర్ లో పని చేస్తున్న నరేష్ ఎన్నికైనట్లు తపస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జిడ్డి ఎల్లం, చల్లా లక్ష్మణ్ తెలిపారు. ఈ సందర్బంగా నరేష్ మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరిస్తానని, తపస్ సంఘం అభివృద్దికి కృషి చేస్తానని అన్నారు. పలువురు పంతుళ్లు ఆయనను అభినందించారు.