ఆదిలాబాద్ జిల్లాలో యాసంగి పంట కొనుగోళ్ల విషయంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ మార్క్ఫెడ్ ద్వారా మద్దతు ధరలతో రైతులు నష్ట పోకుండా మార్కెట్ యార్డుల్లో కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. వాన కాలంలో సాగు చేసిన సోయాబిన్ పంటను మార్కెఫెడ్ ద్వారా సేకరించగా, సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు జరుగుతున్నాయి. యాసంగిలో 1.60 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు జిల్లాలో క్రాప్ బుకింగ్ కాలేదు. దీంతో రైతుల్లో ఆందోళన నెలకుంది.