ఆదిలాబాద్ జిల్లాలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్వాకం ఫలితంగా రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. రైతులకు మద్దతు ధర కల్పించి వారికి అండగా నిలవాల్సిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కార్పొరేట్ సంస్థలాగా వ్యవహరిస్తూ అన్నదాతలను నష్టాలకు గురిచేస్తుంది. అదిలాబాద్ జిల్లాలో వానా కాలం సీజన్లో రైతులు నాలుగు లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేయగా 40 లక్షల క్వింటాళ్ల పంట దిగుబడి వచ్చింది.