క్షయ వ్యాధి నివారణ కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ పట్టణం లోని న్యూ హౌసింగ్ బోర్డు కాలనీ మాల సంఘం భవనంలో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు క్షయ నివారణ అధికారి డాక్టర్ సుమలత వెల్లడించారు. ఆర్ఎంపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుమలత ను కలిసి క్షయ నిర్మూలన పోస్టర్లను ఆవిష్కరించారు. 3న నిర్వహించే సదస్సులో ఆర్ఎంపీలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.