ముగ్గురి ఆత్మహత్యా యత్నం
NEWS Feb 02,2025 11:16 am
ఆర్థిక లావాదేవీల సమస్యలతో భార్యా భర్తలు, వారి సమీప బంధువు ఒకరు పురుగుమందు తాగగా ఇద్దరు మృతి చెందిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. రావాల్సిన డబ్బులు రాక పోవడంతో మనస్తాపం చెందిన రాకేశ్, భార్య, కూతురు, మేన మరదలితో కలిసి ద్విచక్ర వాహనంపై తలమడుగు మండలం ఉండం శివారులోని పొలానికి వచ్చారు. పురుగు మందు తాగి, రాకేశ్, స్పందన మృతి చెందగా లావణ్య చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు రాకేశ్ రాసిన ఆత్మహత్య లేఖను స్వాధీనం చేసుకున్నారు.