కామారెడ్డి , బాన్సువాడ ఇసుకాసురులు మంజీర నదిని తోడేస్తున్నారు. అక్రమంగా ఇసుక తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అనుమతులు లేకుండా అర్ధరాత్రులు తవ్వకాలు చేపట్టి పట్టణాలు, నగరాలకు తరలిస్తున్నారు. ఆరు నెలలుగా ఈ దందా కొనసాగుతోంది. అయినా అధికారులు చోద్యం చూస్తున్నారు.