టీటీడీ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు
NEWS Feb 02,2025 09:57 am
తిరుమలలోని బూందీపోటు, పరకామణి భవనంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా పరకామణి భవనాన్ని పరిశీలించారు. నాణేలు, నోట్లు, బంగారు, వెండి, ఇతర కానుకల విభజన ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. బూందీ తయారీ, నెయ్యి టిన్ లు, పిండి మిక్సింగ్, కన్వేయర్ బెల్ట్ ద్వారా ముడి పదార్థాలను ఆలయంలోకి తరలించే విధానాన్ని పరిశీలించారు. విధి నిర్వహణలో భక్తి భావంతో ఉండాలని సూచించారు.