కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పైన కాంగ్రెస్ నాయకులు మతిలేని మాటలు మాట్లాడుతున్నారని నిజామాబాదు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త అన్నారు. 2047 నాటికీ వికసిత్ భారత్ కల సాకారానికి ముందడుగే ఈ బడ్జెట్ అన్నారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పేదరిక నిర్ములన కోసం, పేద, మధ్య తరగతి వర్గాలకు ప్రాధాన్యత కల్పించినట్లు తెలిపారు. 12 లక్షలు మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు.