సీఎం చంద్రబాబు ఢిల్లీ బాట పట్టారు. ఆయన ఎన్డీయే కూటమికి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఏపీలో కూటమి సర్కార్ కొలువు తీరింది. దీంతో ప్రస్తుతం అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ బరిలోకి దిగింది. ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా చంద్రబాబు ప్రచారం చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే మరాఠాలో జరిగిన ఎన్నికల్లో సైతం సీఎం క్యాంపెయిన్ చేశారు. విచిత్రం ఏమిటంటే తన శిష్యుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో ప్రచారం చేయడం విశేషం.