కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన స్వంత సర్కార్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను ఎవరినీ ఇబ్బంది పెట్టడం లేదన్నారు. ప్రభుత్వంలోని రెవెన్యూ శాఖలో అవినీతి చోటు చేసుకుందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులే ప్రశ్నించాలా..నేను ప్రశ్నించ కూడదా అని ప్రశ్నించారు. బరాబర్ కచ్చితంగా ప్రశ్నిస్తా..నిలదీస్తానని ప్రకటించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాలలో కలకలం రేపుతున్నాయి.