అధికారులు ప్రజా దర్బార్ సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఆదివారం చిన్నమండెం మండలం బోరెడ్డి గారి పల్లెలోని తమ నివాసం నందు మంత్రి ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలు వివిధ సమస్యలపై ప్రజా దర్బార్ కార్యక్రమానికి వస్తుంటారని, సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా పరిష్కరించాలన్నారు.