ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పెన్షన్ల పంపిణీపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదని, రోజు రోజుకు గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించాల్సి వస్తోందన్నారు. ఆదాయం పూర్తిగా తగ్గిందని, బయట అప్పులు పుట్టడం లేదన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా ఎక్కడా పెన్షన్ల పంపిణీని ఆపడం లేదన్నారు. ఠంఛనుగా ప్రతి నెలా ఒకటవ తేదీనే లబ్దిదారులకు వారి ఖాతాల్లో పెన్షన్ డబ్బులను జమ చేస్తున్నామని చెప్పారు సీఎం.