గుంటూరు జిల్లాలో ఉన్న కోనేరు లక్ష్మయ్య యూనివర్శిటీకి ఏ++ గుర్తింపు పొందేందుకు తనిఖీకి వచ్చిన న్యాక్ టీంకు లంచాలు ఇవ్వడం కలకలం రేపింది. యూనివర్శిటీలో చదువుకుంటున్న స్టూడెంట్స్ ఆందోళనకు గురయ్యారు. లంచం ఇచ్చిన మేనేజ్మెంట్ పైన, డబ్బులు తీసుకున్న సభ్యులపై కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి 14 మందిని నిందితులుగా చేర్చింది. కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ప్రెసిడెంట్, ఇతర ప్రతినిధులను , తనిఖీ టీంకు చెందిన 10 మందిని చేర్చించింది.